Monday, June 1, 2026

ఏనుగుల దాడిలో రైతు మృతి

Must Read

కుప్పం మండలం కుర్మానిపల్లిలో ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప మృతి చెందాడు. రాగి పంటకు కాపలా కాస్తున్న సమయంలో ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల నుంచి రైతులను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బంగారుపాళెం మండలం టేకుమందలో సోమవారం రాత్రి ఏనుగులు పంట పొలాలపై దాడి చేశాయి. కౌండిణ్య అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు మామిడి మానుల ద్వారా పొలాలకు చేరాయి. పరదేశి, కౌసల్య, గోవిందయ్య, రేణుకమ్మలకు చెందిన నాలుగు ఎకరాల వరి మడిని తొక్కేశాయి. అరటి చెట్లను కూడా నాశనం చేశాయి. అప్పులు చేసి పంటలు పండించామని, ప్రభుత్వం సహాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -