Monday, April 27, 2026

సూపర్ సిక్స్‌పై సీఎం చంద్ర‌బాబు సమీక్ష

Must Read

రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాల పురోగతి, ప్రజల స్పందనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. అలాగే ఉచిత బస్సు సేవపై అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సూపర్ సిక్స్ విజయవంతం కావడంతో వైసీపీ గందరగోళంలో పడిందని, తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు. ఉచిత బస్సు అంశంపై గందరగోళం సృష్టించే ప్రయత్నాలను ఎదుర్కొని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని నేతలకు సూచించారు. పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు సక్రియంగా పాల్గొనాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వచ్చిన వార్తలతో పాటు అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపైనా ఆయన ఆక్షేపించారు. గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలు పార్టీకే నష్టం కలిగిస్తాయని, అలాంటి చర్యలు ఎవరి నుంచైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు చిన్న విమర్శకైనా అవకాశం ఇవ్వకూడదని, తప్పు ఆరోపణలు వచ్చినా వెంటనే బయటకు వచ్చి వాస్తవాలు వివరించాలని ఆయన ఎమ్మెల్యేలకూ సూచించారు. వ్యక్తిగత చర్యల వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదని హితవు పలికారు. ఈ ఘటనలపై వివరమైన నివేదికను రాష్ట్ర నాయకత్వం నుంచి సీఎం కోరారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -