Sunday, May 31, 2026

సౌదీలో భారతీయ యాత్రికుల బస్సు ప్రమాదం.. 40 మంది మృతి

Must Read

సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ముఫరహత్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన బృందంలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. తెల్లవారుజామున 1:30 గంటలకు మదీనా నుంచి 160 కి.మీ. దూరంలోని ముహ్రాస్ వద్ద ఘటన జరిగింది. ఇంధనం ధాటికి మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. 11 మహిళలు, 10 మంది పిల్లలు మరణించారు. మృతదేహాలు గుర్తించలేకపోయారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. సివిల్ డిఫెన్స్, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. భారత ఏజెన్సీలు స్థలానికి చేరాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -