Monday, April 27, 2026

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల

Must Read

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు జరిగాయి. హాజరు శాతం 92.90గా నమోదైంది. పరీక్షలను ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నియామకాలు ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎక్కువ కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలకమైన అవకాశమని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -