Tuesday, April 14, 2026

తిరుమల లడ్డూ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Must Read

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం.. స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కల్తీ లడ్డూపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఐదుగురితో సిట్ ఏర్పాటు చేయాలని.. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, సిట్(రాష్ట్రం) నుంచి ఇద్దరు, నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక్కరు ఉండాలని సూచించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని ఆదేశించింది. ఈ లడ్డూ వ్యవహారం రాజకీయ నాటకంగా మారాలని తాము కోరుకోవడం లేదని వెల్లడించింది. ఈ దర్యాప్తు స్వతంత్రంగా సాగాలని పేర్కొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -