Saturday, February 15, 2025

వరద సాయంపై చంద్రబాబు రివ్యూ

Must Read

ఏపీలో వరద బాధితులకు అందాల్సిన పరిహారంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 97 శాతం పంపిణీ పూర్తి చేశామన్నారు. బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా మిగిలిన బాధితులకు నగదు జమ కాలేదన్నారు. లబ్ధిదారులు బ్యాంక్ కు వెళ్లి కెవైసీ పూర్తి చేసుకోవాలని కోరామని…రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. సమీక్షలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -