ఛత్తీస్గఢ్ దండకారణ్యం నెత్తురోడుతోంది. తాజాగా మావోయిస్టుల ఘతుకానికి 10 మంది జవాన్లు మరణించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో చోటుచేసుకుంది. మావోయిస్టులు భద్రతా బలగాల వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందారు. 8 మందికి తీవ్రగాయాలవ్వగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.