ప్రముఖ నటుడు కల్యాణ్ రామ్, ఎమ్మెల్సీ, నటి విజయశాంతి గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న తాజా మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయ
శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి, కొడుకులు గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం రేణిగుంటకు చేరుకున్న రామ్, విజయశాంతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ విజయం సాధించాలని వారు కోరుకున్నారు.