దుబాయ్లో జరిగిన 24హెచ్ కార్ రేస్లో హీరో అజిత్ కుమార్.. ఆయన బృందం మూడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన టీమ్కు పలు వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హీరో శివకార్తికేయన్, దర్శకుడు శివ, సంతోష్ నారాయణన్, లోకేష్ కనగరాజ్, యువన్, కార్తీక్ సుబ్బరాజ్, శాంతను, హరీష్ కళ్యాణ్ తదితరులు అభినందనలు తెలిపారు.
“దుబాయ్ 24హెచ్ రేసింగ్ పోటీలో 991 కేటగిరీలో మూడో స్థానం, జీటీ4 కేటగిరీలో ‘స్పిరిట్ ఆఫ్ ద రేస్’ అవార్డు కైవసం చేసుకున్న అజిత్ కుమార్, ఆయన టీమ్ కు హృదయపూర్వక శుభాభినందనలు. సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి గొప్ప పట్టుదలతో రేసులో గెలిచి భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించడం నిజంగా స్ఫూర్తిదాయకం. మీరు, మీ జట్టు మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.