‘నానుమ్ రౌడీ దాన్’ డాక్యుమెంటరీ వివాదంపై నయనతార, ధనుష్లు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్పై ధనుష్ దావా వేశారు. పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్ను ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్పైనా దావా వేసింది. అయితే ధనుష్ దావాను సవాల్ చేస్తూ నెట్ఫ్లిక్స్ ఓ పిటిషన్ను దాఖలు చేసింది. తాజాగా నెట్ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది.