Sunday, June 1, 2025

News

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం!

హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహించింది. నగరంలోని పలుచోట్ల కూల్చివేతలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా చట్టప్రకారం వ్యవహరించడం లేదని పేర్కొంది. ‘శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు? ఆదివారం...

నా మతం మానవత్వం

వైఎస్ జగన్ ఎమోషనల్ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన కులం, మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు అని, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని.. గడప దాటితే హిందూ, ఇస్లాం, సిక్కు, బౌద్ధ మతాలను గౌరవిస్తానని తెలిపారు. పాదయాత్ర...

చంద్రబాబు ఒక రాక్షసుడు!

చంద్రబాబు దుర్బుద్ధితోనే తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీశారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని ఒక దుష్ప్రచారం చేయించి రాక్షసానందం పొందారని విమర్శించారు. 100 రోజుల పాలన విఫలం అవ్వడంతోనే ఈ లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే నెయ్యి కంటైనర్లు వచ్చాయని, దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది...

జగన్ తిరుమల పర్యటన రద్దు

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. చంద్రబాబు లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాప ప్రక్షాళన చేయాలని వైఎస్ జగన్ భావించారు. కానీ జగన్ పై దాడికి కుట్ర పన్నారని పార్టీ వర్గాల నుంచి తెలియడంతో పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు...

మంటల్లో దేవర.. తప్పిన పెను ముప్పు

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో పెను ముప్పు తప్పింది. మూవీ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగింది. కొందరు వ్యక్తులు బాంబులు పేల్చారు. దీంతో పక్కనే ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో కటౌట్ కాలిపోయింది....

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్

ఇక అయోధ్యకు నేరుగా ఫ్లైట్ తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ రోజు నుంచి హైదరాబాద్ – అయోధ్య మధ్య కొత్త సర్లు మొదలుకానున్నాయి. ఈ రూట్లలో వారానికి నాలుగు సార్లు విమాన సేవలు నడపనున్నారు.

రాహుల్ గాంధీపై సైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నటుడు సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ నిజాయతీ గల పొలిటికల్ లీడర్ అని, ఎంతో ధైర్యవంతుడని కొనియాడారు. ప్రజాభిమానం చూరగొనేందుకు రాహుల్ ఎంతో శ్రమించారని తెలిపారు. తనపై వచ్చిన...

ఆఫీసర్లకు కేటీఆర్ వార్నింగ్!

కొందరు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారి, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్ట ప్రకారం నడుచుకుంటే భవిష్యత్తులో ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ శివారులో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారా? లేదా? అన్నది హైకోర్టులో చెప్పాలన్నారు. ఫార్మా సిటీ కోసం గతంలో 14 వేల ఎకరాల...

బాంబులతో పేల్చేసిన హైడ్రా

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. ఓఆర్ఆర్ పరిధి దాటి దూసుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోని చెరువులో ఓ వ్యక్తి ఏకంగా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అక్కడికి వెళ్లేందుకు చెరువు మీదుగా మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాడు. దీనిని ఒక అతిథి గృహంగా మార్చాడు....

ఆర్. కృష్ణయ్య రాజీనామా! త్వరలో కాంగ్రెస్ లోకి?

బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో అతనికి రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. ఈ పదవి మరో రెండేండ్లు ఉన్నప్పటికీ.. ఆర్.కృష్ణయ్య రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేశారు.టచ్ లోకి...

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...