Tuesday, January 27, 2026

News

నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు వెన‌క్కి తీసుకుంటున్నా: మంత్రి కొండా సురేఖ

ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాలనే ఉద్దేశంతో చేయలేదని, ఇబ్బంది పెట్టడం లేదా పరువు దెబ్బతీయడం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పొరపాటు జరిగి ఉంటే చింతిస్తున్నానని, వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

ముంబై విమానాశ్రయంలో రూ.14 కోట్ల గంజాయి స్వాధీనం

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన 14 కేజీల విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఆరుగురు స్మగ్లర్ల నుంచి ఈ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా ఈ దందా బయటపడింది. అనుమానం రాకుండా వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లలో లగేజీ బ్యాగుల్లో దాచి తీసుకొచ్చారు. స్కానింగ్ సమయంలో ప్యాకెట్లు...

బెట్టింగ్‌లో నష్టాలతో యువకుడు ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బెట్టింగ్ ఆటల్లో లక్షల రూపాయలు కోల్పోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన అఖిల్ (31) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పట్టణంలోని హోటల్‌లో గది తీసుకున్నాడు. తండ్రికి ఫోన్ చేసి బెట్టింగ్ వల్ల నష్టపోయానని, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపాడు. ఇంటికి రా,...

జూబ్లీహిల్స్‌లో స‌ర్వేల‌న్నీ కాంగ్రెస్ వైపే!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలపై చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్‌పోల్ సర్వేలు ఆసక్తికర అంచనాలు వెల్లడించాయి. చాణక్య సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 46 శాతం ఓట్లు రాగా, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. స్మార్ట్‌పోల్ సర్వేలో కాంగ్రెస్‌కు 48.2 శాతం, బీఆర్ఎస్‌కు 42.1 శాతం, బీజేపీకి...

వేములవాడ ఆలయంలో భక్తుల దర్శనాలు తాత్కాలిక నిలిపివేత

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామునుంచి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులు ఏర్పాటు చేశారు. ఆలయ చుట్టూ పలు చోట్ల ఇప్పటికే రేకులు అమర్చారు. భక్తుల కోసం స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఉంచారు....

తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రాజకీయ వేడి మళ్లీ పెరిగింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు నిరసన చేపట్టగా, అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కేతిరెడ్డికి...

మెడికల్ కాలేజీల‌ ప్రైవేటీకరణపై వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ముమ్మరం చేసింది. బుధవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతల నేతృత్వంలో నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు...

మౌలానా ఆజాద్‌కు జగన్ నివాళి

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. స్వాతంత్య్ర‌ సమరయోధుడు, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి అందించిన సేవలు అమరమని ట్వీట్ చేశారు. మైనార్టీ సంక్షేమం, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల‌ కోడ్ ఉల్లంఘన.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ కేసులు నమోదు చేశారు. అనధికారికంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించామని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు...

నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు న‌మోదు

ఫిలింనగర్ రోడ్ నంబర్ 7లో నివసించే శివప్రసాద్ ఇంటిని ఆక్రమించే ప్రయత్నంలో నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన అనుచరులు తాళం పగులగొట్టి ఆస్తులు ధ్వంసం చేశారు. మూడు రోజుల క్రితం బంధువుల వద్దకు వెళ్లిన శివప్రసాద్ తిరిగి వచ్చి ధ్వంసాన్ని చూసి సిబ్బందిని సురేష్ ఇంటికి పంపాడు. సిబ్బందిపై అసభ్యంగా మాట్లాడి దాడికి యత్నించిన...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...