ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ పాల ధరలను తగ్గించింది. కంపెనీ అందిస్తున్న ప్రధాన పాల ఉత్పత్తులు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ ఫ్రెష్పై లీటరుకు రూ.1 చొప్పున తగ్గించినట్టు ప్రకటించింది. కొత్త రేట్లు జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చినట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా తెలిపారు.
తగ్గించిన ధరల ప్రకారం.. అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ.66 (పాతధర) నుంచి రూ.65 (కొత్తధర)కు, అమూల్ తాజా రూ.54 నుంచి రూ.53కు, అమూల్ టీ స్పెషల్ రూ.62 నుంచి 61కి అందుబాటులోకి వచ్చింది. అమూల్ బ్రాండ్ ఉత్పత్తుల హైక్వాలిటీని కొనసాగిస్తూ వినియోగదారులకు మరింత లబ్ది చూకూర్చేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు జయేన్ మెహతా ఒతెలిపారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.