Sunday, June 21, 2026

Today Bharat

షిరిడిలో ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసులు మృతి

మహారాష్ట్రలోని షిరిడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికుల‌తో వెళ్తున్న తుఫాన్ వాహ‌నం.. అదుపుత‌ప్పి ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఆరు నెలల చిన్నారి ఉంది. మృతులంతా తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు...

సైఫ్ అలీఖాన్‌పై కత్తులతో దాడి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడి దాడి తీవ్ర కలకలం రేపింది. ఈరోజు(గురువారం) తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ.. ఆయనపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. దొంగను పట్టుకునేందుకు సైఫ్ యత్నించగా.. అతడు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో సైఫ్ కు ఆరు చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి....

చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్.. తీవ్ర అస్వస్థత

సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ అనుమతి లేకుండా విద్యాసంస్థల్లోని డైరీఫాంలోకి మనోజ్ చొరబడ్డాడని మోహన్ బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈరోజు పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉన్న తన తాతయ్య, నాన్నమ్మ...

కొత్త ఏడాదిలో ఇస్రో సరికొత్త రికార్డ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ఈరోజు (గురువారం) ఎక్స్‌ వేదికగా...

తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలు విడుదలయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌తో (ఏప్రిల్ 29, 30) పరీక్షలు ప్రారంభమై జూన్ 11 నుంచి 14 వరకు జరిగే పీఈసెట్‌తో పరీక్షలు ముగుస్తాయి. సాధారణంగా ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఎప్‌సెట్‌కు 45 రోజుల సమయం ఉండేది. అయితే, ఈసారి...

బ్రాహ్మణికి లోకేశ్‌ గిఫ్ట్.. రిప్లై ఇదే

ఏపీ సీఎం చంద్రబాబు సహా కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మంత్రి నారా లోకేశ్ తన సతీమణి బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు....

కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశించింది. తాజాగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా...

నిజామాబాద్‌లో పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి

నిజామాబాద్‌ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. ఈ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల...

ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య

సంక్రాంతి పండుగ వేళ ఒకే ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, నందమూరి బాలకృష్ణ ఫోటోలు ఉండడం వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లాలోని ముగ్గు వెంకటాపురంలో ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫోటో కింద బాస్ ఈజ్ బ్యాక్, బాలకృష్ణ ఫోటో కింద డాకు మహారాజ్, కేసీఆర్ ఫోటో...

టీమిండియా కెప్టెన్సీ రేసులో యశస్వి జైస్వాల్

రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్‌ రిటైర్మెంట్‌పై చర్చ జరిగింది. అయితే, ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్‌.. బోర్డర్‌-గావాస్కర్‌ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో టెస్టుల నుంచి కూడా తప్పుకోనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ మరి కొంత కాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img