దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నేడు ఉదయం నుంచి సుమారు 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో సర్వత్రా ఆందోళనకు గురయ్యారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్లు ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని సమగ్ర తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు నేపథ్యంలో పాఠశాలల సిబ్బంది, విద్యార్థులను...
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక చర్య తీసుకుంది. ఆయనపై మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, మొత్తం రూ. 37.64 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను కూడా జప్తు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు...
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. “ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు చేయడం కాంగ్రెస్ పాలనలో సర్వసాధారణం కావడం దుర్మార్గం. గల్ఫ్ కార్మికుల కోసం...
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం రాజకీయాలలో వేడి పెరుగుతోంది. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు నుంచి ఊరట లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఈ తీర్పు వెలువడింది. 2016లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిపై గోపన్నపల్లిలోని 31...
తెలంగాణతో విభేదాలు పెంచుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేను. అదేలా అమరావతిని కూడా అభివృద్ధి చేయడం నా బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. గోదావరి నీటిని రెండు రాష్ట్రాలూ వినియోగించుకుంటున్న నేపథ్యంలో, ప్రధాని మోదీ నదుల అనుసంధానాన్ని ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు....
ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు...
మలక్పేట్లో ఇటీవల చోటుచేసుకున్న సీపీఐ నేత చందురాథోడ్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన ఐదుగురి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వ్యక్తిగత విభేదాలే...
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఒక సాహసోపేతమైన, చారిత్రాత్మక అంతరిక్ష మిషన్ను విజయవంతంగా పూర్తి చేసి భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. భారత అంతరిక్ష రంగానికి ఇది మరొక గర్వకారణమైన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా, అధిక సాంకేతికతతో కూడిన కఠిన పరిస్థితుల్లో...
ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక రాక్షస పాలనా అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా లేదని, ప్రభుత్వ పరిపాలన స్థానంలో రెడ్బుక్ రాజ్యాంగం పని చేస్తోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సీఎం చంద్రబాబుపై...