ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని వైఎస్సార్సీపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కర్నూలు ఎయిర్పోర్టులో ఆయన్ను కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్ తదితరులు ఈ విజ్ఞప్తి చేశారు. అలాగే, వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని...
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ నేతలను టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. బీసీ నాయకుడు జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలు లోకేశ్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీలు ఉన్నారని ఆయన ఆరోపించారు....
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహిళలను అవమానించడం అలవాటుగా పెట్టుకుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మీపై టీడీపీ ఎమ్మెల్యే థామస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీన్ని సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన మహిళా నాయకురాలిపై వీడియోలు తీయించారని,...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ఆయనకు గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన మోదీ, అనంతరం కర్నూలు నన్నూరు సమీపంలో ‘సూపర్ జీఎస్టీ-సూపర్...
భారత్లో చెత్త నిర్వహణ తీవ్ర సమస్యగా మారిందని బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అన్నారు. బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించలేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్లో ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. బెంగళూరు రోడ్లు, చెత్తపై విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో తాను...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తును కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నన్నూరు వద్ద జరిగిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు...
సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం చిన్నారులను ఉపయోగించడం చట్టవిరుద్ధమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ను రూపొందిస్తున్నాయని, ఇది బాలల హక్కుల ఉల్లంఘనే కాక, పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టాలకు విరుద్ధమని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.చిన్నారులతో ఇలాంటి కంటెంట్ తయారు చేసే వారిపై...
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, అఫ్గాన్ భారత్ తరఫున పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇది ఎక్కువ కాలం...
తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరిద్దామని సూచించినట్లు తెలిసింది.కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను ఇటీవల బాధ్యతల నుంచి తొలగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గట్టి...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవకు అంకితమైన కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు....