Monday, April 27, 2026

హ‌రీష్ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీపై కేటీఆర్ విమ‌ర్శ‌లు

Must Read

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్‌ విచారించడంపై స్పందిస్తూ, ఇది సిట్‌ విచారణ కాదు, పిచ్చి విచారణ అని అన్నారు. న్యాయం కోసం అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కేటీఆర్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ వాటిని నెరవేర్చలేకపోతున్నారని, ఈ మేరకు కేసులు నమోదు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి సృజన్‌ రెడ్డి అని, ఈ విషయంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. “ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పసలేని కేసు అని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది. అయినా ఈ కేసును సాగదీయడంలో అర్థం ఏమిటి? ఒక్క అధికారిక ప్రకటన జరగిందా? ఒకరిపైనైనా నేరం రుజువు అయిందా?” అని ప్రశ్నించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -