Thursday, January 15, 2026

కల్వకుంట్ల కవిత జనం బాట యాత్ర షురూ!

Must Read

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి జనం బాట పేరుతో నాలుగు నెలల సుదీర్ఘ యాత్రను అక్టోబర్ 25న ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఫిబ్రవరి 13 వరకు 33 జిల్లాల్లో కొనసాగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇందల్‌వాయి టోల్‌గేట్ వద్ద బైక్ ర్యాలీలో పాల్గొని, జాగృతి కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నవీపేట మండలం యంచ వద్ద ముంపు బాధితులతో సమావేశం, నందిపేటలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేస్తారు. ఉదయం 9 గంటలకు గన్‌పార్క్‌లో నివాళులర్పించి, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకుంటారు. యాత్రలో మేధావులు, విద్యావంతులతో చర్చలు జరపనున్నారు. రాజకీయంగా ముందడుగు వేయడంతో పాటు, ప్రజలు కోరితే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశముందని కవిత ప్రకటించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -