Thursday, January 15, 2026

తెలంగాణ బంద్‌తో ప్ర‌యాణికుల అవ‌స్థ‌లు!

Must Read

42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్ల వద్ద ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రోజూ 3,500 బస్సులు రాకపోకలు సాగించే ఎంజీబీఎస్‌లో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ, హయత్‌నగర్, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం డిపోల్లో బస్సులు ఆగిపోయాయి. బీసీ సంఘాలు దిల్‌సుఖ్‌నగర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించగా, ప్రైవేట్ బస్సులు, వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం జరిగింది. బంద్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్ వాహనదారులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బంద్‌లో పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -