Thursday, April 16, 2026

వరదల నష్టం నివారణపై సీఎం రేవంత్ స‌మీక్ష‌

Must Read

ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, చెరువులు, భవనాలు, విద్యుత్ సబ్‌స్టేషన్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులు ఉన్నప్పటికీ వాటి వినియోగంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. అంబేద్కర్ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వరదల కారణంగా జరిగిన ప్రాణనష్టం, పశునష్టం భరించిన కుటుంబాలకు తక్షణ పరిహారం చెల్లించాలని సూచించారు. గత ఏడాది ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జరిగిన నష్టానికి కేంద్రం నుంచి రాకపోయిన సహాయం వివరాలు, ప్రస్తుత వరదల నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 257 చెరువులు, కుంటలు గండిపడిన విషయంపై స్పందిస్తూ చిన్న నీటిపారుదల విభాగం నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించి పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు రావడంతో రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. నీటమునిగిన సబ్‌స్టేషన్ల స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని, వీధిదీపాల సమస్యలపై సమీక్ష చేసి పరిష్కారం అందించాలని సూచించారు. కలెక్టర్లకు వరద సహాయక చర్యల కోసం నష్టంపై ఆధారపడి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -