Tuesday, January 27, 2026

ప్ర‌తి మండ‌లానికి న‌లుగురు స‌ర్వేయ‌ర్లు – మంత్రి పొంగులేటి

Must Read

తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ నెల 27న శిక్షణ పొందిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్‌ ప్రాక్టికల్స్‌ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 12న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు సర్వేయర్లతోపాటు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమించనున్నట్లు తెలిపారు. నక్షా లేని 413 గ్రామాలు రాష్ట్రంలోఉన్నాయన్నారు. నక్షా కోసం 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీసర్వే చేశామని, వీటి ఫలితాలను పరిగణనలోకి తీసుకుని మిగిలిన గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -