Thursday, April 16, 2026

మ‌తం గురించి మాట్లాడొద్దు – ఏకనాథ్ షిండే

Must Read

పహల్గామ్ ఉగ్రదాడి నేప‌థ్యంలో ఓ మ‌తానికి చెందిన వారిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే స్పందించారు. ఈ దాడిలో జాతి, మతం గురించి మాట్లాడకూడద‌ని వ్యాఖ్యానించారు. పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, ఇల్లు కట్టిస్తామని శివసేన పార్టీ తరఫున హామీ ఇచ్చారు. పర్యాటకులను కాపాడడానికి వెళ్లి మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కూడా అమరుడేన‌న్నారు. ఉగ్రవాదుల నుండి గన్ లాక్కుని పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించి సయ్యద్ హుస్సేన్ షా మరణించాడ‌ని, వాళ్ల కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లినపుడు వారి ఆర్థిక పరిస్థితి, ఇల్లు చూసి బాధ క‌లిగింద‌ని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -