టాలీవుడ్లోని సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్నుశాఖ దాడులపై నిర్మాత, FDC చైర్మన్ దిల్రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడి ఇంట్లో జరగడం లేదని తెలిపారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, రెండు రోజులుగా ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. దిల్రాజుఇల్లు, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి, నిర్మాత శిరీష్ ఇంట్లో, మైత్రీ మూవీస్ సంస్థ, ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప-2 మూవీల ఆదాయ వ్యయాలపై అధికారులు విచారిస్తున్నారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది.