ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన యూజర్లను అలర్ట్ చేసింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ 11, అంతకంటే తక్కువ వెర్షన్ మొబైల్స్లో యోనో (YONO) సేవలను నిలిపివేయనుంది. ఈ మేరకు పాత వెర్షన్ వాడుతున్న స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు మెసేజ్లు పంపుతోంది. యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 లోపు పాత వెర్షన్ ఫోన్లు వాడుతుంటే వారు ఆండ్రాయిడ్ 12 అంత కంటే కొత్త వెర్షన్కు అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే యోనో సేవలు నిలిచిపోతాయని SBI స్పష్టం చేసింది.