పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు వీరే..!
1954 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వ్యక్తులకు పద్మ అవార్డులతో సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. 2025 గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డులు అందుకున్న వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
పద్మ అవార్డుల జాబితా ఇదే..
పద్మ విభూషణ్:
దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి: వైద్యం – తెలంగాణ
జస్టిస్ సింగ్ ఖేహర్: ప్రజా వ్యవహారాలు – చండీగఢ్
కుముదిని రజనీకాంత్ లఖియా: కళ – గుజరాత్
లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం: కళ – కర్ణాటక
MT వాసుదేవన్ నాయర్ : సాహిత్యం మరియు విద్య – కేరళ
ఒసాము సుజుకి : వాణిజ్యం మరియు పరిశ్రమ – జపాన్
శారదా సిన్హా : కళ – బిహార్
పద్మ భూషణ్:
నందమూరి బాలకృష్ణ (కళలు) – ఆంధ్రప్రదేశ్
ఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – కర్ణాటక
అనంత్ నాగ్ (కళలు) – కర్ణాటక
బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – ఎన్సీటీ దిల్లీ
జతిన్ గోస్వామి (కళలు) – అస్సాం
జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) – కేరళ
కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) – ఎన్సీటీ దిల్లీ
మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – మహారాష్ట్ర
నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు
పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) – కేరళ
పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) – గుజరాత్
పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) – మహారాష్ట్ర
రామ్బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – ఉత్తర్ప్రదేశ్
సాధ్వీ రితంభరా (సామాజిక సేవ) – ఉత్తర్ప్రదేశ్
ఎస్.అజిత్ కుమార్ (కళలు) – తమిళనాడు
శేఖర్ కపూర్ (కళలు) – మహారాష్ట్ర
శోభన చంద్రకుమార్ (కళలు) – తమిళనాడు
సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – బిహార్
వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – అమెరికా
ఏపీ, తెలంగాణ నుంచి పద్మ శ్రీ అవార్డు అందుకున్న వ్యక్తుల జాబితా
కేఎల్ కృష్ణ : సాహిత్యం & విద్య
మాడుగుల నాగఫణి శర్మ : కళ
మందకృష్ణ మాదిగ : ప్రజా వ్యవహారాలు
మిరియాల అప్పారావు : కళ
వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి : సాహిత్యం & విద్య