Tuesday, July 1, 2025

తిరుమల లడ్డూ వ్యవహారం..చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు

Must Read

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈక్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ‘లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్ కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు.’ అని పేర్కొంది. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ‘చంద్రబాబు విచారణకు ఆదేశించినట్లు అయితే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంది? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, ఎలాంటి ఆధారం లేని ఆరోపణలు చేయడం తగదు. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. నెయ్యి కల్తీ జరిగిందో లేదో తెలియనప్పుడు.. ప్రెస్ కు కల్తీ జరిగిందని ఎందుకు చెప్పారు? ’ అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -