Sunday, June 1, 2025

కల్తీ లడ్డూ చంద్రబాబు కట్టు కథ

Must Read

చంద్రబాబు తన తప్పులను, మోసాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగాలనే నీచ బుద్ధి చంద్రబాబుకే చెల్లిందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం, వరదల నియంత్రణలో విఫలం అవ్వడంతోనే చంద్రబాబు మతిలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో నెయ్యిని పరీక్షించిన తర్వాతే లడ్డూ తయారీకి వాడుతారని, ఏండ్ల నాటి నుంచి ఇదే సంప్రదాయం జరుగుతోందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -