Monday, January 26, 2026

ఓటుకు నోటు.. విచారణకు రావాల్సిందే!

Must Read

నాంపల్లి కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 16న కోర్టులో హాజరు కావాలని ఉత్తర్వులిచ్చింది. నాంపల్లి కోర్టులో ఈ రోజు ఈడీ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితులైన వారిలో ఒకే ఒక్కరు ముత్తయ్య విచారణకు హాజరయ్యారు. మిగిలిన నిందితులైన రేవంత్ రెడ్డి, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని సదరు నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వచ్చే నెల 16న మాత్రం విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -