Sunday, December 28, 2025

బాంబులతో పేల్చేసిన హైడ్రా

Must Read

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. ఓఆర్ఆర్ పరిధి దాటి దూసుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోని చెరువులో ఓ వ్యక్తి ఏకంగా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అక్కడికి వెళ్లేందుకు చెరువు మీదుగా మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాడు. దీనిని ఒక అతిథి గృహంగా మార్చాడు. రాత్రి వేళల వచ్చి ఇక్కడే పార్టీలు చేసుకునేవాడు. ఏకంగా చెరువులోనే నిర్మాణం ఉండడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఆ బిల్డింగుకు బాంబులు అమర్చి పేల్చేశారు. రెండు సెకన్లలోనే భవనం కుప్పకూలింది.

హైడ్రాకు అడ్డగింతలు..

మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు చేస్తున్నారు. నదీ సమీపంలోని భవనాలకు మార్కింగ్ వేస్తున్నారు. అవసరమైన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే, పలుచోట్ల హైడ్రా అధికారుల్ని స్థానికులు అడ్డుకున్నారు. సర్వే చేయకుండా నిలువరించారు. తమ ఇండ్లు కూల్చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -