హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ నిర్మాణాలు గుర్తించారు. రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా, తొలగింపుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సోమవారం ఉదయం హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తుతో నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని...
తెలంగాణ హోమ్ శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ ఎమోజి రిప్లైపై బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీ సమావేశం పోస్టుకు వచ్చిన కామెంట్కు నవ్వు ఎమోజి పెట్టడం వివాదాస్పదమైంది. దీనిపై సీవీ ఆనంద్ స్పందిస్తూ, రెండు నెలల క్రితం హ్యాండ్లర్ పొరపాటున పెట్టిన ఎమోజి అని, తనకు తెలియకుండా జరిగిందని వివరించారు....
తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రభుత్వానికి తెలిపినా స్పందన లేదని సమ్మె చేపట్టారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు ఆగాయి. ఇదే సమయంలో ఆసిఫాబాద్...
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని బస్సు ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణమే జనగామ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతులను దిండిగల్కు చెందిన...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కొనసాగుతోంది. 101 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజ వేసింది. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులోనూ కాంగ్రెస్ బలపడింది. మొదటి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో నిలిచారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్కు 8,926...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్గూడ వద్ద ఫంక్షన్ హాల్లోకి అనుచరులతో వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల హెచ్చరికలు లెక్కచేయకుండా ఉద్రిక్తత రెచ్చగొట్టినట్టు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా బిగుసుకుపోతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. పొగమంచు కూడా పెరిగింది. రానున్న రోజుల్లో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 13...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు విషెస్ అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో భారీ సంఖ్యలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తూ రేవంత్ ఆరోగ్యవంతుడిగా ఉండాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ నేతకు జన్మదిన విషెస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
తెలంగాణలో ఈ ఫార్ములా కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్టు చేయడానికి లేదా చార్జిషీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సవరణల ప్రకారం ఇది అవసరమని తెలిపారు. విచారణకు...
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపుపై సానుకూల ఫలితాలు సాధించాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో, ప్రభుత్వం మొత్తం రూ.1,500 కోట్ల బకాయిలలో ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. మిగిలిన రూ.600...
ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...