ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సూచనలు చేశారు. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి అని అన్నారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు నగరంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్ ద్వారా వరంగల్కు చేరుకోనున్నారు. ఆ తర్వాత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ...
ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, చెరువులు, భవనాలు, విద్యుత్ సబ్స్టేషన్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులు ఉన్నప్పటికీ వాటి వినియోగంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. అంబేద్కర్ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వరదల కారణంగా...
ప్రైవేట్ రంగంలోని డ్రైవర్లకు ఇచ్చే రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి ఆకర్షణీయ హామీలు ఇచ్చినా, గద్దెనెక్కాక ఉన్న పథకాలనే రద్దు చేసి ప్రజలను...
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేతలకు, నేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మానవ నాగరికత పురోగతిలో చేనేతకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత కార్మిక కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న...
స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని పరిమితి విధిస్తూ చేసిన చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు కూడా...
స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన జయశంకర్ సార్ త్యాగస్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిదని సీఎం గుర్తుచేశారు. అలాగే, తన...
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,...
స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఓ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో...
రాష్ట్రంలో విద్యుత్ విభాగాన్ని ప్రక్షాళన చేయడానికి అవసరమైన కీలక సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇంధన శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్...