మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తీ అహ్లావత్కు విడాకులు ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ నికర ఆస్తుల విలువ గురించి ప్రచారం జరుగుతోంది. ఆయన ఆస్తుల విలువ రూ.340 కోట్ల నుంచి రూ.350 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఢిల్లీలోని హౌజ్ ఖాస్లో ఒక భవనం, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, BMW 5 సిరీస్లతో సహా అత్యాధునిక కార్లు, హర్యానాలో సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కలిగి ఉన్నారు.