అఫ్గాన్ మహిళా క్రికెటర్లు మళ్లీ క్రికెట్ ఆడనున్నారు. ఆస్ట్రేలియాకు శరణార్థులుగా వెళ్లిన ఈ జట్టు ఇప్పుడు ఒక్కటిగా కలిసి బరిలోకి దిగనున్నారు. మెల్బోర్న్లో క్రికెట్ వితౌట్ బోర్డర్స్ ఎలెవన్తో అఫ్గానిస్థాన్ మహిళల ఎలెవన్ జట్టు గురువారం ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ను క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ వితౌట్ బోర్డర్స్, ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తున్నాయి. కాగా, 2021లో అఫ్గానిస్థాన్లోని అమ్మాయిలు ఆటలు ఆడకుండా తాలిబన్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే.