Tuesday, April 28, 2026

భాగ్యనగరంలో డీజేలపై నిషేధం

Must Read

హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున్న రూల్స్ బ్రేక్ చేశారని, ఈసారి మరింత శృతిమించి వ్యవహరించారని సీవీ ఆనంద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజేలపై నిషేధం విధించామన్నారు. డీజేలు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
డీజేల వ్యాపారంపై కోలుకోలేని దెబ్బ..
నగరంలో వేలాది మంది యువకులు డీజేలపై ఆధారపడి జీవిస్తున్నారు. సొంతంగా డీజే షాపులు పెట్టి పండుగలు, పెండ్లిళ్లలో సేవలందిస్తున్నారు. డీజేలపై నిషేధం వల్ల వీరి వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడనుంది. కాగా, డీజే శబ్ధాల వల్ల పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని సీవీ ఆనందం తెలిపారు. ఈమేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -