ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్లు, పోలీసులకు హైకోర్టు ఊరట లభించింది. ఈ కేసులో ఐపీఎస్లు కాంతిరాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతురావు, సీఐ సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని కాంతిరానా, విశాల్ గున్నీ, తదితరులు తెలిపారు.