Friday, May 9, 2025

జ‌వాన్ ముర‌ళీకి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

Must Read

భార‌త సైన్యంపై పాకిస్థాన్ జ‌రిపిన కాల్ప‌ల్లో వీర మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ పోస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఇండియా-పాకిస్తాన్ యుద్ధభూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ వీర మ‌ర‌ణం తీవ్ర బాధ కలిగించింది. దేశం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఈ దుఃఖ సమయంలో మేము వారితో పాటు నిలుస్తాము.. అని ఆయ‌న పోస్టులో పేర్కొన్నారు.మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్‌లో పరామర్శించారు. ఎల్ల‌వేళ‌లా త‌మ‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా క‌ల్పించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

క‌శ్మీర్‌లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల్లో క‌శ్మీర్‌లో పాక్ కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర‌మ‌ర‌ణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -