కరోనా మహమ్మారి మరోసారి ప్రజలపై పంజా విసురుతోంది. దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనాతో రెండు మరణాలు సంభవించడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో 21 ఏళ్ల యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందారు. దేశంలో పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా కేసులు కేరళలో 273, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్నాటకలో 36 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఒకటి, విశాఖ, కడప జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది.