ప్రపంచాన్ని భయపెట్టిన మహమ్మారి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్తగా 257 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భారత్తో పాటు పలు దేశాల్లో కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల నమోదైన కేసుల్లో ఓ మహిళ, బాలుడు కరోనాతోనే మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.