Wednesday, July 2, 2025

మహిళలపై టీడీపీ కార్యకర్తల దాడి

Must Read

వైసీపీ హయాంలో ఇల్లు నిర్మించుకున్న మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. వృద్ధురాళ్లు అనే దయ లేకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇప్పుడున్నది తమ ప్రభుత్వమంటూ దారుణానికి పాల్పడ్డారు. ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం భోగినేపల్లిలో జరిగింది. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కరె వెంకటేశ్, కరె ప్రసాద్ అనే అన్నదమ్ముళ్లు.. స్థానికంగా ఇల్లు నిర్మించుకున్న నాగమ్మపై దాడి చేశారు. ఆ ఇంటి స్థలం తమదంటూ దాష్టీకానికి పాల్పడ్డారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -