Saturday, July 5, 2025

పోలీసులపై మరోసారి పవన్ కళ్యాణ్ ఫైర్!

Must Read

వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల వైఖరిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. మంగళవారం వేమవరంలోని సరస్వతి ప్లాంట్ భూములను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడి యువతని భయపెడితే.. పోలీసులు చూస్తూ ఊరుకున్నారని తెలిపారు. పోలీసులు మెత్తబడ్డారా? లేక భయపడ్డారా? అని ప్రశ్నించారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి రాదని అందుకే పవర్ ప్లాంట్ అని చెప్పారన్నారు. పేదలకు ఇచ్చిన భూములను అన్యాయంగా లాక్కున్నారని ఫైర్ అయ్యారు. భయపెట్టి, బాంబులు వేసి రైతుల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. తాము మెతక వైఖరితో లేమని చెప్పేందుకే ఇక్కడికి వచ్చామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీజేపీ నుంచి ఎవ‌రు వెళ్లినా న‌ష్టం లేదు – రాంచంద‌ర్ రావు

బీజేపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేద‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -