Sunday, June 1, 2025

సీఎం రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు లేఖ

Must Read

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హ‌రీష్ రావు బ‌హిరంగ‌ లేఖ రాశారు. రాష్ట్రంలో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరారు. అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌ ప‌దోన్న‌తులు, వేత‌నాల గురించి ప్ర‌స్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలున్నార‌ని, వీరంతా అంకితభావంతో సేవలు అందిస్తున్నార‌ని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్ 5న వారికి అంగన్వాడీలుగా పదోన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసిన‌ట్లు గుర్తు చేశారు.ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఉత్తర్వులు అమలు కాలేద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీత‌క్క మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తిస్తూ మొదటి సంతకం చేశార‌న్నారు. 2023 డిసెంబర్ 15న ఇదే విషయంపై జీవో కూడా జారీ చేశార‌న్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో తిరిగి కొత్తగా ప్రచారం కోసం విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశార‌ని ఆరోపించారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు అంగన్వాడీ పే గ్రేడ్‌లో రూ.13,650 జీతం చెల్లించిన ప్రభుత్వం, ఆ తర్వాత మినీ అంగన్వాడీ జీతం రూ.7,800కి తగ్గించి, 2025 ఏప్రిల్ వరకు అదే జీతం చెల్లించింద‌న్నారు. మే నెలలో కేవలం ఎనిమిది జిల్లాల్లోని మినీ అంగన్వాడీలకు మాత్రమే అంగన్వాడీ పే గ్రేడ్ జీతాలు చెల్లించి, మిగతా జిల్లాల వారికి జీతాలు చెల్లించలేద‌న్నారు.

మేనిఫెస్టోలో చెప్పి మ‌రీ మోసం…
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మరీ మహిళలను మోసం చేశార‌ని హ‌రీష్ రావు ఆరోపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మోసం, రాష్ట్రంలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని మోసం, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తానని మోసం, లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని మోసం, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని మోసం, అంగన్వాడీలకు 18,000 నెలసరి జీతం పెంచుతామని మోసం, మినీ అంగన్వాడీలను అంగన్వాడీలను చేస్తామని మోసం. ఇలా కాంగ్రెస్ మహిళలకు చేసిన మోసాల లిస్ట్ రాస్తే చాంతాండంత అవుతుంద‌ని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తాను విడుదల చేసిన జీవోను గౌరవించి జనవరి 2024 నుంచి మినీ అంగన్వాడీలకు పెంచిన జీతం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీ నుండి అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట హెల్పర్లను వెంటనే నియమించాల‌న్నారు. మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే అందరికీ జీతాలు చెల్లించాల‌ని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -