Tuesday, July 1, 2025

11 మంది చ‌నిపోతే రాద్ధాంత‌మా – సీఎం సిద్ధ‌రామ‌య్య‌

Must Read

ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో ప‌లువురు మృత్యువాత ప‌డ‌టంపై క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య స్పందించారు. 11 మంది చ‌నిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే మేం ఏమైనా అన్నామా అని వ్యాఖ్యానించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగింద‌ని, స్టేడియం కెపాసిటీ 30 వేలు మాత్రమే ఉంటే 3 లక్షల మంది అభిమానులు వచ్చార‌ని చెప్పారు. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందార‌ని, 33 మంది తీవ్రంగా గాయపడ్డార‌ని వెల్ల‌డించారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం అందిస్తామ‌న్నారు. గాయపడ్డ వారికి ప్రభుత్వమే చికిత్స అందిస్తుంద‌న్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -