Monday, October 20, 2025

ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ తరహా తీర్చిదిద్దాల‌న్న సీఎం రేవంత్ రెడ్డి

Must Read

ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సూచనలు చేశారు. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి అని అన్నారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించండి అని అన్నారు. ప్లే గ్రౌండ్ తరగతి గదులు మంచి వాతావరణం ఉండేలా చూడండి అని అన్నారు. విద్యా శాఖ పరిధిలో స్థలాలను గుర్తించండి అని అన్నారు. సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో ప్రభుత్వ స్థలానికి తరలించండి అని అన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించండి అని అన్నారు. కార్పొరేట్ స్కూల్ స్థాయిలో వసతులతో విద్య అందించే ఏర్పాటు చేయండి అని అన్నారు. విద్యార్థులకు పాలు బ్రేక్ ఫాస్ట్ లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయండి అని అన్నారు. 2026 జూన్ అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లండి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -