Thursday, January 15, 2026

రాయలసీమపై చంద్రబాబు నిర్లక్ష్యం: శైలజానాథ్

Must Read

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్, రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్‌లను తరలించారని, నీటి వనరులు, నిధులను కోల్పోయామని ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం జరిగి 87 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మార్పు లేదని, వైఎస్ జగన్ తాగు-సాగు నీటి ప్రాజెక్టులు తెచ్చారని కొనియాడారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి పనులను చంద్రబాబు ఆపేశారని, పోలవరం ఎత్తు తగ్గించడం ద్వారా అన్యాయం జరిగిందని విమర్శించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి, జగన్ ప్రాజెక్టులను కొనసాగించాలి, సిద్దేశ్వర అలుగు నిర్మాణం చేపట్టాలి, నీళ్లు-నిధుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -