Friday, May 9, 2025

తిరుపతికి బాంబు బెదిరింపు!

Must Read

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని పలు హోటల్స్ లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. పోలీసులు అప్రమత్తమై హోటళ్లను చెక్ చేశారు. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఈ–మెయిల్‌లో బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాది​క్ కు ఇటీవల జైలు శిక్ష ఖరారు చేయగా.. సదరు మెయిల్ లో ఆ అజ్ఞాత వ్యక్తి ఆక్రోశం వెళ్ళగక్కారు. శిక్ష పడేందుకు తమిళ సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించడం తమకు నచ్చలేదంటూ టెర్రరిస్ట్ ఈ–మెయిల్ పంపాడు. రాష్ట్రంలోని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకుందని, తిరుపతిలోనూ పలు హోటళ్లను పేల్చేస్తామని తెలిపాడు. దీంతో పోలీసులు హైఅలెర్ట్ అయ్యారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నూతన పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్

ఇటీవ‌ల‌ పోప్ ఫ్రాన్సిస్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం త‌దుప‌రి పోప్ ఎవ‌రు అవుతార‌న్న దానిపై కొద్దిరోజులుగా తీవ్ర చ‌ర్చ న‌డిచింది. కాగా, తీవ్ర...
- Advertisement -

More Articles Like This

- Advertisement -