Monday, October 20, 2025

హిజ్రాల రక్షణకు తమిళనాడులో ‘అరణ్’ వసతి గృహాలు

Must Read

తమిళనాడు ప్రభుత్వం హిజ్రా సముదాయం వ్యక్తులపై జరిగే దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ‘అరణ్’ (రక్షణ) పేరుతో వసతి గృహాలను ప్రవేశపెట్టింది. తొలి విడతలో చెన్నై మరియు మదురైలో రెండు గృహాలను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో అవసరాలను బట్టి ఈ గృహాల సంఖ్యను పెంచనున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మంది ఉండేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సమాజంలో అభద్రతాభావం, వివక్ష, వెలివేత, వేధింపులకు గురైన హిజ్రాలు లేదా అనాథలుగా మిగిలినవారు గుర్తింపు కార్డు చూపించి ఈ గృహాల్లో ఉచిత వసతిని పొందవచ్చు. బాధితుల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం కౌన్సెలింగ్ బృందాలను నియమించింది. ఈ గృహాల్లో ఆహారం, దుస్తులతో పాటు చదువుకునే సౌకర్యాన్ని సామాజిక సంక్షేమం మరియు మహిళా సాధికారత శాఖ కల్పిస్తోంది. అవసరమైన వారికి న్యాయ సాయం కూడా అందించనున్నారు. ఈ వసతి గృహాల్లో 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -