Friday, January 16, 2026

హిజ్రాల రక్షణకు తమిళనాడులో ‘అరణ్’ వసతి గృహాలు

Must Read

తమిళనాడు ప్రభుత్వం హిజ్రా సముదాయం వ్యక్తులపై జరిగే దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ‘అరణ్’ (రక్షణ) పేరుతో వసతి గృహాలను ప్రవేశపెట్టింది. తొలి విడతలో చెన్నై మరియు మదురైలో రెండు గృహాలను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో అవసరాలను బట్టి ఈ గృహాల సంఖ్యను పెంచనున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మంది ఉండేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సమాజంలో అభద్రతాభావం, వివక్ష, వెలివేత, వేధింపులకు గురైన హిజ్రాలు లేదా అనాథలుగా మిగిలినవారు గుర్తింపు కార్డు చూపించి ఈ గృహాల్లో ఉచిత వసతిని పొందవచ్చు. బాధితుల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం కౌన్సెలింగ్ బృందాలను నియమించింది. ఈ గృహాల్లో ఆహారం, దుస్తులతో పాటు చదువుకునే సౌకర్యాన్ని సామాజిక సంక్షేమం మరియు మహిళా సాధికారత శాఖ కల్పిస్తోంది. అవసరమైన వారికి న్యాయ సాయం కూడా అందించనున్నారు. ఈ వసతి గృహాల్లో 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -