Saturday, February 15, 2025

షిరిడిలో ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసులు మృతి

Must Read

మహారాష్ట్రలోని షిరిడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికుల‌తో వెళ్తున్న తుఫాన్ వాహ‌నం.. అదుపుత‌ప్పి ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఆరు నెలల చిన్నారి ఉంది. మృతులంతా తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప వాసులుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దేవుడి దర్శనానికి వెళ్లిన వారు విగతజీవులుగా మారడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -