కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6లక్షల 50వేల వరకు రేషన్ కార్డులు ఇచ్చాం. కానీ, ఏనాడు మేము ప్రచారం చేసుకోలేదు. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా? మేము మీసేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డులు ఇచ్చాము. ఇప్పుడు రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ధనాన్ని వృధా చేస్తుంది.’ అంటూ కేటీఆర్ విమర్శించారు.