చంద్రబాబు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారులు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. భూముల విలువ, బుక్ విలువ మధ్య తేడాలుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్. దీనిపై త్వరలో సీఎం చంద్రబాబు కూడా ప్రకటన చేసే అవకాశం ఉందట. రిజిస్ట్రేషన్ల విలువలు 15 నుంచి 20 శాతం వరకూ పెంచాలని నిర్ణయించినట్లు వినిపిస్తోంది. ఏ ప్రాంతంలో ఎంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలనే అంశాలపై ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.