Sunday, May 18, 2025

జగన్ తిరుమల పర్యటన రద్దు

Must Read

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. చంద్రబాబు లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాప ప్రక్షాళన చేయాలని వైఎస్ జగన్ భావించారు. కానీ జగన్ పై దాడికి కుట్ర పన్నారని పార్టీ వర్గాల నుంచి తెలియడంతో పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి, తిరుమలలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. పోలీస్ యాక్ట్ 30 ని తెరపైకి తెచ్చారు. ఒక రోజు ముందు నుంచే వైసీపీ కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని తద్వారా పర్యటనను అడ్డుకోవాలని కూడా కొందరు భావించారు. చివరికి, జగన్ పర్యటన రద్దు అయ్యేలా చేశారు. కాసేపట్లో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -